తెలంగాణలో రేపటి నుంచి టీచర్ల బదిలీలు..!

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబర్.

5 ను జారీ చేసింది.ఈ క్రమంలో రేపు కేటరిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్ లైన్ లో ప్రకటించనున్నారు.

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ గా ఈ పదోన్నతులు జరగనున్నాయిని తెలుస్తోంది.ఈనెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ నేపథ్యంలో హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత టీచర్లు ఎంఈవోలకు దరఖాస్తులను సమర్పించాలి.అదేవిధంగా ప్రాథమిక ఉన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు అందించాలి.

Advertisement

కాగా ఈ దరఖాస్తులను ఈనెల 31 లోపు సమర్పించాలని జీవోలో అధికారులు పేర్కొన్నారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు