తెలంగాణలో రేపటి నుంచి టీచర్ల బదిలీలు..!

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబర్.5 ను జారీ చేసింది.ఈ క్రమంలో రేపు కేటరిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్ లైన్ లో ప్రకటించనున్నారు.

 Transfers Of Teachers From Tomorrow In Telangana..!-TeluguStop.com

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ గా ఈ పదోన్నతులు జరగనున్నాయిని తెలుస్తోంది.ఈనెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.ఈ నేపథ్యంలో హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత టీచర్లు ఎంఈవోలకు దరఖాస్తులను సమర్పించాలి.అదేవిధంగా ప్రాథమిక ఉన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు అందించాలి.

కాగా ఈ దరఖాస్తులను ఈనెల 31 లోపు సమర్పించాలని జీవోలో అధికారులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube