సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి.మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలి అక్కడ స్థిరపడాలి అనుకున్న కొందరు అమాయకులను మేము సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళతో పరిచయం చేస్తాం వీళ్లకు పరిచయం చేస్తాము అని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.అమాయకులను మోసం చేయడానికి ఎప్పుడూ కొందరు సిద్ధంగా ఉంటారు.
తాజాగా కూడా హైదరాబాదులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ముద్దుగుమ్మ రష్మిక మందన్న పేరు చెప్పి ఒక వ్యక్తిని మోసం చేశారు.
చిన్న మోడలింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి, సినిమా ఛాన్సలు ఇప్పిస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.బాలీవుడ్ యాక్టర్స్ అయిన వారిని అపూర్ అశ్విన్, నటాషా కపూర్ గా గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలు నిర్వహిస్తామని వీళ్లు చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా రన్ చేస్తున్న ఈ ఇద్దరూ తమ బుట్టలో పడిన ఓ వ్యాపారవేత్తను సైతం బురిడి కొట్టించారు.ఆయన దగ్గర నుంచి ఏకంగా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
రోజులు గడుస్తున్నా సరే వారి నుంచి ఎలాంటి కబురు లేకపోవడంతో సదరు వ్యాపారవేత్తకు సీన్ అర్థం అయ్యి వెంటనే తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే వీరికి నిజంగానే హీరోయిన్ రష్మిక తో సంబంధం ఉందా లేకపోతే రష్మిక మందన పేరు చెప్పి వీరు మోసాలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.