సినీ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్ చేశారు.అయితే నిన్న సినిమా విజయోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ అక్కినేని, తొక్కినేని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అన్న బాలయ్య వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు,, ఆ రంగారావు .అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.