తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మురళీమోహన్ రాజకీయ నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.అదేవిధంగా ఒక వ్యాపారవేత్తగా నిర్మాతగా కూడా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
గత ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన మురళీమోహన్ తన సొంత గ్రామానికి కూడా అపారమైన సేవలు అందించారు.ఈయన ఏలూరు జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు.
ఇక ఈ గ్రామంలో ఈయన తన తాతల కాలం నాటి ఇంటిని తిరిగి రీ మోడలింగ్ చేయిస్తున్నారు.
తన తాతల కాలం నాటి ఆ ఇల్లు ఎలాంటి రూపురేఖలతో ఉందో ప్రస్తుతం అదే రూపురేఖలతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ఇంటిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.అయితే ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఈ ఇంటిని ఆ గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఉపయోగించుకునే విధంగా ఈయన ఈ ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు.గతంలో ఈ ఇంటిలో ప్రాథమిక వైద్యశాల ఉండేది.
అయితే ఈ ఇల్లు శిథిలావస్థకు రావడంతో ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాల మరొక చోటకు మార్చబడింది.
ఈ క్రమంలోనే ఆ ఇంటిని మరమ్మతు చేయించి గ్రామ ప్రజల అవసరాల కోసం ఆ ఇంటిని ఇవ్వబోతున్నట్లు మురళీమోహన్ తెలిపారు.ఇక తను కూడా అదే ఇంటిలో పుట్టి పెరిగి అక్కడే తన విద్యాభ్యాసం, తన సినీ ప్రయాణం కూడా మొదలైందని మురళీమోహన్ ఆ ఇంటితో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఇక ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఈ ఇంటిని ఏ అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అనే విషయం గురించి తుది నిర్ణయం తీసుకుంటామని మురళి మోహన్ తెలియజేశారు.