టాలీవుడ్ లో సంగీత దర్శకులు అనగానే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.ఆ ఇద్దరు మరెవరు కాదు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరియు థమన్.
వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ స్టార్ హీరోల సినిమా లకు ట్యూన్స్ చేస్తున్నారు.ఒక సారి థమన్ పై చేయి సాధిస్తే, మరో సారి దేవి శ్రీ ప్రసాద్ ఆకాశమే అద్దుగా హిట్ ని సొంతం చేసుకుంటున్నాడు.
మొన్న సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
వాల్తేరు వీరయ్య సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు, ఇక బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా కు థమన్ సంగీతాన్ని అందించాడు.ఈ రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా యొక్క మ్యూజిక్ ఆల్బమ్ 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని దూసుకు పోతోంది.
వీర సింహా రెడ్డి సినిమా యొక్క పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.గతం లో దేవి శ్రీ ప్రసాద్ పాటలను మించి థమన్ యొక్క పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఉండేవి.కానీ ఇప్పుడు మాత్రం రేసులో థమన్ వెనుక పడ్డాడని చెప్పాలి.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది లో థమన్ కచ్చితంగా తన సత్తా చాటే విధంగా మ్యూజిక్ ఆల్బమ్స్ ఇవ్వబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కచ్చితంగా ముందు ముందు మరిన్ని భారీ వాల్తేరు వీరయ్య వంటి మాస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తాడు అంటూ ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ మధ్య వార్ సీరియస్ గానే సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ముందు ముందు అయినా థమన్ పై చేయి సాధిస్తాడా అనేది చూడాలి.