విజయవాడ తెలుగుదేశం పార్టీలో గ్రూప్ వార్ మరింత ముదురుతోంది.పార్టీ నేతలు కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది.
ఎంపీ కేశినేని నాని ఇక డైరెక్ట్ అటాక్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.నిన్న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేశినేని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని వాదనలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా కేశినేని చిన్ని వర్గం కూడా నానిపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే పార్టీ అధిష్టానం బెజవాడ పరిస్థితులపై ఆరా తీస్తుంది.ఈ క్రమంలోనే చంద్రబాబుతో సీనియర్ నేతలు సమావేశం అయ్యారు.
వర్గపోరు నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







