వైసీపీ మంత్రి అమర్నాథ్ చంద్రబాబు.పవన్ కళ్యాణ్ లపై సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇద్దరిది భార్య భర్తల అనుబంధం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడిగా ప్రచారం ప్రారంభిస్తే బాగుంటుందని తెలిపారు.
ఇలా చేయడం వల్ల రెండు పార్టీలకు ఖర్చు మిగులుతాయని పేర్కొన్నారు.వారాహిపై పవన్ ఒక్కడే వస్తాడో.? చంద్రబాబుతో కలిసి వస్తాడో.? పవనే నిర్ణయించుకోవాలని అన్నారు.
ఇదే సమయంలో జీవో నెంబర్ వన్ మీద సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పి వేశామని రహదారులపై బహిరంగ సభలకు మాత్రమే అనుమతి లేదని ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్లలో ఏడాదికి వచ్చిన పెట్టుబడులు 11 వేల కోట్లు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు.చంద్రబాబు దావోస్ వెళ్లి ప్రచారాలకు పరిమితమయ్యారు.కానీ జగన్ దావోస్ పర్యటనలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని.మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.







