ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్న ఆయన కాలం చాలా శక్తివంతమైనదన్నారు.
ఈ రోజు ఆప్ ఢిల్లీలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు.రేపు కేంద్రంలో తామే అధికారంలో ఉంటామని వ్యాఖ్యనించారు.
ఎప్పటికీ అధికారంలో ఉంటామని అనుకుంటే అది జరిగే పని కాదని తెలిపారు.పేదలకు మంచి విద్య, వైద్యం అందించడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తోందని విమర్శించారు.







