చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదైంది.అయితే పోలీసులపై హత్యాయత్నం చేశారని కేసు పెట్టడాన్ని టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు.
కాగా ఈ కేసులో పది మందికి హైకోర్టు మధ్యంతర, ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్వు కోర్టులో వాదనలు వినిపించారు.
పిటిషనర్లపై ఐపీసీ సెక్షన్ 307 నమోదు చేసేందుకు తగిన కారణాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు.తమ పార్టీ అధినేత వస్తున్నప్పుడు అక్కడకు వెళ్తుండగా అడ్డుకోవడమే కాకుండా లాఠీఛార్జ్ చేశారని పేర్కొన్నారు.23 మంది పోలీసులపై హత్యాయత్నం సాధ్యమేనా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపు లాయర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపడతామని వెల్లడించింది.