బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల ముందు వరుసలో ఉంటుంది.అయితే ఈమె వ్యాఖ్యాతగా ఈటీవీలో గత కొన్ని సంవత్సరాల నుంచి క్యాష్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలగా ప్రసారమౌతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.అయితే ఉన్నఫలంగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడంతో ప్రేక్షకులు ఎంతో ఆందోళన చెందారు.
ఇక ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినప్పటికీ సుమ యాంకర్ గా సుమా అడ్డా అనే మరొక కొత్త కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ విధంగా క్యాష్ కార్యక్రమాన్ని నిలిపివేసి మరొక కొత్త షో ప్రారంభించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే మల్లెమాలవారు ఈ షో ఆపవేయడానికి పలు కారణాలను తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతివారం క్యాష్ కార్యక్రమానికి సెలబ్రిటీలను తీసుకురావడం చాలా కష్టతరంగా మారిందని మల్లెమాల వారు తెలియజేస్తున్నారు.
ఇలా సెలబ్రిటీలను ఈ కార్యక్రమానికి తీసుకురావడం కష్టంగా మారడంతో తీసుకువచ్చిన వారిని తిరిగి తీసుకురావడంతో ప్రేక్షకులు కాస్త బోర్ గా ఫీల్ అవుతున్నారని,అందుకే ఈ కార్యక్రమ రేటింగ్స్ కూడా కాస్త తగ్గడంతో మల్లెమాలవారు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారట.ఇక క్యాష్ కార్యక్రమానికి ఏదైనా సినిమా విడుదలవబోతుంది అంటే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమానికి వచ్చేవారు.
అయితే మిగతా వారాలన్నీ కూడా మల్లెమాల వారి సెలబ్రిటీలను తీసుకురావాల్సి ఉండడంతో కష్టతరంగా మారిందని వెల్లడించారు.ఇక సుమ క్యాష్ కార్యక్రమంలో ద్వారా ప్రేక్షకులను ఎలా అయితే సందడి చేస్తున్నారో అదేవిధంగా సుమ అడ్డా కార్యక్రమానికి కూడా అంతే మంచి ఆదరణ వస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ లో భాగంగా సంతోష్ శోభన్ హాజరు కాగా రెండవ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి