థియేటర్లో రచ్చ చేసిన బాలయ్య ఫ్యాన్స్... షో మధ్యలో ఆపివేసిన యాజమాన్యం?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి నటి సింహం బాలకృష్ణకు కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే విదేశాలలో కూడా బాలయ్య సినిమాలకు ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది.

 America Theater Stops Veerasimha Reddy Movie Due To Balayya Fans Hungama Details-TeluguStop.com

ఇకపోతే తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో బాలయ్య అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు అయితే ఇక్కడ మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని చెప్పాలి.

ఇకపోతే అమెరికాలో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా చూస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పేపర్లు చింపుతూ గాల్లోకి విసిరి ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఇది చూసినటువంటి థియేటర్ యాజమాన్యం సినిమాని మధ్యలోనే నిలిపివేశారు.ఇలా షో మధ్యలోనే ఆపేయడమే కాకుండా ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.

అయితే ఎప్పుడు కూడా ఇలా చేయలేదని యాజమాన్యం బాలయ్య అభిమానులపై మండిపడ్డారు.

ఈ విధంగా థియేటర్లో అభిమానులు చేస్తున్న రచ్చను చూసినటువంటి యాజమాన్యం మధ్యలోనే షో నిలిపివేసి అందరిని బయటకు పంపించేశారు.అదేవిధంగా మరో థియేటర్లో జై బాలయ్య అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అలా అరవద్దని ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం సూచించారు.ఏది ఏమైనా ఈ సినిమాకి వస్తున్న ఆదరణ మాత్రం భారీగానే ఉందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube