ఏపీలో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది .ప్రస్తుతం అక్కడ నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు.
వరుసగా ఆ నియోజక వర్గం నుంచి గెలుస్తూ వస్తున్న కొడాలి నాని టిడిపికి కొరకరాని కొయ్యగా మారారు.నిత్యం చంద్రబాబు పైన , లోకేష్ పైన టిడిపి కీలక నాయకుల పైన సెటైర్ల తో విరుచుకుపడుతూ నాని విమర్శలు చేస్తూ ఉంటారు .ఈసారి జరగబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఏదో రకంగా ఓడించి , ఇంటికి పంపించాలనే ఆలోచనతో టిడిపి ఉంది .అందుకే ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి దింపి ఈ సీటు దక్కించుకోవాలని ఎత్తులు వేస్తోంది.దీనిలో భాగంగానే రాము అనే ఎన్ఆర్ఐ ను నాని ప్రత్యర్థుల పోటీకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ సంగతి ఇలా ఉంటే తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో నందమూరి వారసులు తారకరత్న భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే తన కోరిక బయటపెట్టారు.
ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా తాను రాబోయే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నట్లుగా తారకరత్న లోకేష్ కు చెప్పారట.అయితే ఈ విషయంలో తారకరత్నకు లోకేష్ ఎటువంటి హామీ ఇవ్వలేదట.
దీనిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారట.అసలు తారకరత్న గుడివాడ నుంచి పోటీ చేయాలనుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి.
ఎన్టీఆర్ తరువాత నందమూరి వంశస్థులు ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేయలేదు.దీంతో ఎప్పుడు తనకు అవకాశం ఇస్తారు అనే ఆశతో తారకరత్న ఉన్నారట.దీంతోపాటు తాను గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తనకు మద్దతుగా ఎన్టీఆర్ సైతం ఎన్నికల ప్రచారానికి వస్తారని అంచనా వేస్తున్నారట.అయితే ఈ విషయంలో చంద్రాబాబే ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.