నెల్లూరు జిల్లా కావలిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా టీడీపీ ఛలో కావలికి పిలుపునిచ్చింది.
జీవో నెంబర్ 1 ప్రకారం పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు.
అనంతరం దళిత నేత ఎంఎస్ రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు సీతారాంపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.అదేవిధంగా పలువురు నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.







