అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.మాజీమంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.అయితే పాదయాత్రకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కాల్వకు నోటీసులు ఇచ్చిన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.







