కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2023లో జర్మన్ ఆడియో బ్రాండ్ సెన్హైజర్ ఇట్ తన లేటెస్ట్ వైర్డ్ ఇయర్ఫోన్స్ను లోనే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.సెన్హైజర్ IE 200 పేరుతో దీనిని గ్లోబల్ లాంచ్ చేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది.భారతదేశంలో రూ.14,990 ధరతో విడుదల కానుంది.సెన్హైజర్ IE 200 ఇయర్ ఫోన్స్ 2023, జనవరి 17న ప్రపంచవ్యాప్తంగా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి.ఈ ఆడియో ప్రొడక్ట్ సెన్హైజర్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, హెడ్ఫోన్ జోన్ వంటి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో జనవరి 31, 2023 నుంచి అమ్మకానికి వస్తుంది
ఇక సెన్హైజర్ IE 200 స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుంటే.
ఇది Sennheiser TrueResponse ట్రాన్స్డ్యూసర్ టెక్నాలజీ ఆధారంగా డిజైన్ చేయబడింది.IE 200 అద్భుతమైన క్వాలిటీ సౌండ్ ఆఫర్ చేస్తుంది.ఇందుకు అనుగుణంగా 7-మిల్లీమీటర్ల ఎక్స్-వైడ్ బ్యాండ్ ట్రాన్స్డ్యూసర్ను ఇందులో అందించారు.డ్యూయల్-ట్యూనింగ్ ఫీచర్తో కూడా ఇది వస్తుంది.
ఇది హ్యాండ్లింగ్ నాయిస్ను తగ్గిస్తుంది.వివిధ రకాల ఆడియోఫైల్ డివైజ్లకు చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేలా 3.5mm స్టీరియో ప్లగ్, MMCX కనెక్టర్లతో ఈ ఇయర్ఫోన్స్ లాంచ్ అవుతాయి.గేమ్స్ ఆడే వారికి ఈ ఇయర్ ఫోన్స్ బెస్ట్గా నిలుస్తాయి.
ఈ వైర్డు ఇయర్ఫోన్స్ జీరో లేటెన్సీతో కాంపిటేటివ్ గేమింగ్కి సరిగ్గా సూట్ అవుతాయి.వైర్స్ ఉన్నా కూడా వీటిని విడగొట్టడం చాలా ఈజీ.దీనివల్ల అల్లికలు పడతాయనే భయం ఉండదు.ఇంకా ఇవి బ్లూటూత్ ఇయర్ బడ్స్ తో పోలిస్తే మరింత అద్భుతమైన అనుభూతిని ఆఫర్ చేస్తాయి.