చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 400 రోజుల వ్యవధిలో 4 వేల కిలోమీటర్ల మేర మారథాన్ పాదయాత్ర చేపట్టే కార్యక్రమాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ బుధవారం ఆవిష్కరించారు.ముఖ్యంగా యువతను ఆకర్షించడంతోపాటు ఎజెండా నిర్దేశించే ప్రక్రియలో వారిని చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా తన పాదయాత్ర సాగుతుందని లోకేష్ ప్రకటించారు.
ఈ పాదయాత్రకు “యువ గళం” (యువత వాయిస్) అని పేరు పెట్టారు.రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్ర యువతను కోరారు.
యువతతో పాటు మరికొందరు ఏకతాటిపైకి రావడానికి, మాట్లాడేందుకు, అర్హులకు పోరాడేందుకు పాదయాత్ర వేదికగా నిలుస్తుందన్నారు.రాష్ట్ర జనాభాలో యువత దాదాపు 50% ఉన్నారని, రాష్ట్రంలో కేవలం 12% మాత్రమే ఉపాది పొందుతున్నారని, క్రైమ్ రేట్లలో రాష్ట్రం నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉందని లోకేష్ అన్నారు.ఇంతవరకు అంతా బాగనే ఉంది. అయితే యూత్ని ఆకర్షించే సత్తా లోకేష్కు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.ఎమ్మెల్యేగా గెలవడంలో విఫలమైన లోకేష్ రాజకీయ నాయకుడిగా పని రాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తు వస్తు్న్నారు, ఒక్కవేళ లోకేశ్ పాదయాత్ర మెుదలు పెట్టిన దీనికి అడ్డంకులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .ముఖ్యంగా చంద్రబాబు యాత్రలలో జరుగుతున్న వివిధ ఘటనలను బుచిగా చూపి యాత్రకు అధికార పార్టీ అడ్డుకుంటుదని అభిప్రాయపడుతున్నారు.అలా కాకుండా ఈ పాదయాత్రతో లోకేష్పై ట్రోలింగ్స్ వచ్చే అవకాశం ఉంది. లోకేష్ తన తండ్రి లా ఉచ్చారణ చేయడంలో విఫలమవుతారని దాన్ని అసరగా వైసీపీ ట్రోల్స్ స్టార్ట్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ పరిస్థితులలో ఆయన యూత్కి ఎంత వరకు చేరువ అవుతారో చూడాలి.