బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులతో కూడా పరిచయం పెంచుకుంది.
పలు సినిమాలలో నటించిన ఈమె స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది.కానీ కొంత వరకు తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
మోడలింగ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లను బాగా పిచ్చెక్కిస్తుంది.నిజానికి ఈమె ధరించే దుస్తులు చూస్తే మతి పోక తప్పదు.పైగా కొన్ని కొన్ని సార్లు బాగా నెగటివ్ కామెంట్స్ కూడా ఎదురుకుంటుంది.కానీ అవేవి పట్టించుకోకుండా తానే ఏంటో తాను చూసుకుంటుంది.
ఇక ఈ బ్యూటీ నటిగా కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయం లో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.ఇప్పటికే తను స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ విషయంలో చాలాసార్లు వార్తల్లోకెక్కింది.
గతంలో ఊర్వశి రౌతేలా స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ ను ప్రేమించింది.ఈ విషయం బాలీవుడ్ లో కోడై కూసింది.ఇక ఈ జంట చాలా సార్లు మీడియా కంటికి చిక్కింది.వీళ్లు గతంలో డిన్నర్ డేట్ లలో బాగా తిరిగారు.కొంత కాలం డేటింగ్ లో ఉండి బాగా ఎంజాయ్ చేశారు.కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరి మధ్య బ్రేక్ అప్ జరిగింది.
ప్రస్తుతం ఊర్వశి సింగిల్ గా ఉంది.అయితే ఇటీవలే తన మాజీ బాయ్ ఫ్రెండ్ రిషబ్ కు ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిదే.ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.దీంతో ఆయన అభిమానులు ఊర్వశి పై బాగా టార్గెట్ చేశారు.
ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈమె ఎటువంటి స్పందన రాకపోయేసరికి ఆమెపై అవుతున్నారు.
అంతేకాకుండా ఆమె బాగా ఫోటోషూట్ లో కూడా చేయించుకుంటుంది.ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.ఇక ఆమె ఫోటోలు పంచుకున్న ప్రతిసారి రిషబ్ గురించి టాపిక్ తీస్తున్నారు అభిమానులు.
ఆయన ఎలా ఉన్నాడు కనీసమైన ఆయన గురించి పట్టించుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇదంతా పక్కన తాజాగా తాను ఇన్ స్టాలో ఒక ఫోటో పంచుకుంది.
అందులో తాను మొసళ్ళ రూపంతో ఉన్న డిజైన్ జ్యువెలరీ ధరించగా తన ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.నగలు ఇలా కూడా వేసుకుంటారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ ఆమె మొసళ్ళ తల్లి అంటూ ట్రోల్ చేశారు.ఇక్కడ కూడా రిషబ్ టాపిక్ తీస్తూ ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు ఈ సమయంలో నువ్వు రిషబ్ దగ్గర ఉండాలి కానీ ఇలా ఫోటోలు దిగడం అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు.ఈమె చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ లో నటించగా ఇటీవలే ఆ పాటను విడుదల చేశారు.