గడిచిన 20 సంవత్సరాలలో ఐపాడ్ టచ్ నుంచి ఐఫోన్ మినీ వరకు అనేక టెక్ ఉత్పత్తులు విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.అయితే వాటిలో కొన్ని అందరికీ నిరాశ మిగిలిస్తూ 2023 నుంచి అందుబాటులోకి రావడం ఆపేసాయి.
అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది మేలో యాపిల్ తన ఐపాడ్ టచ్ను నిలిపివేసింది.
ప్రజలు మ్యూజిక్ వినగలిగే విధానాన్ని మార్చేసిన ఇది ఎల్లప్పుడూ గుర్తుండిపోయే ఐకానిక్ పరికరాలలో ఒకటిగా నిలిచింది.ఇది 10-గంటల బ్యాటరీ లైఫ్, 1,000 పాటలు అందించిన వరల్డ్స్ ఫస్ట్ MP3 ప్లేయర్ డివైజ్.
ఈ ఐపాడ్ టచ్ 2001లో రిలీజ్ అయింది.కాగా రెండు దశాబ్దాల కాలంలో టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చాయి.
దాంతో ఐపాడ్ టచ్ని కొనుగోలు చేసేవారు కరువయ్యారు.దీనివల్ల కంపెనీ ఈ ప్రోడక్ట్ ని తయారు చేయడం ఆపేసింది.
దాంతో 2023లో ఐపాడ్ టచ్ కనిపించదు.
యాపిల్ తన ఐఫోన్ మినీ వెర్షన్ను డిస్ కంటిన్యూ చేసింది.
ఫ్లాగ్షిప్ ఫోన్లలో యూజర్లకు చీప్ వెర్షన్ను అందించడానికి మినీ వెర్షన్ను కంపెనీ తీసుకొచ్చింది.అయితే డిజైన్, ఫీచర్స్ ఆకట్టుకోలేకపోవడంతో ఈ మొబైల్ ను కొనే వారి సంఖ్య తగ్గింది.
దీనివల్ల కంపెనీ ఈ మొబైల్ ప్రొడక్షన్ ఆపేసింది.

ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందించి రీసెంగ్గానే అయిపోయింది.కొత్త ఎడ్జ్ బ్రౌజర్ని పరిచయం చేసిన వ్యక్తులకు మెరుగైన, సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజర్ను అందించడానికి పాత బ్రౌజర్ను శాశ్వతంగా నిలిపిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ కొద్ది వారాల క్రితం ప్రకటించింది.ఇక 2023లో పాపులర్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ బ్లాక్బెర్రీ కూడా కనిపించదు.







