యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు బారులు తీరారు.నూతన సంవత్సరంతో పాటు ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.
దీంతో ఆలయంలోని క్యూలైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.
అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.







