సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది.త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.
ఈ సినిమా ఫాస్ట్ గా పూర్తి చేసి సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ చేయడంతో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది.
హాలీవుడ్ స్థాయిలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఇంటర్నేషనల్ సినిమాగా తీసుకు రావాలని కసరత్తులు కూడా స్టార్ట్ చేసారు.ఈ సినిమా స్టార్ట్ కాకుండానే ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.
తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి అండ్ టీమ్ అయితే బిగ్గెస్ట్ అడ్వెంచరస్ డ్రామాని ఫ్రాంచైజ్ లా పలు భాగాలుగా చేయాలని చూస్తున్నారట.ఒక అవతార్ ఫ్రాంచైజ్ లా ఈ సినిమాను రాజమౌళి చేయాలని అనుకున్నారని తెలిసి తెలుగు తేజం ఇప్పుడు గర్వపడుతుంది.ప్రెజెంట్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్టోరీని మరింత డెవలప్ చేసే పనిలో ఉన్నారట.
ఇలా మహేష్ సినిమా ఒక ఫ్రాంచైజ్ రూపంలో వస్తే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో.ఈ సినిమా ఎంత వరకు వెళుతుందో చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.ఎల్ నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







