రంగారెడ్డి జిల్లాలో సివిల్స్ విద్యార్థిని సూసైడ్ కేసులో కొత్తకోణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లాకాలనీలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.ఈ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.

 A New Angle In The Suicide Case Of Civils Student In Rangareddy District-TeluguStop.com

సివిల్స్ విద్యార్థిని పూజిత గౌడ్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.

డాక్టర్ అలీ అనే వ్యక్తితో పూజితకు నాలుగేళ్లుగా పరిచయం ఉంది.ఈ క్రమంలో అలీకి పెళ్లి అయిందని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైన పూజిత ఈనెల 26న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా పూజిత రాయల్ విల్లాస్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube