బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె టాలీవుడ్ లో హీరో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో పొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.ఇకపోతే కియారా అద్వానీ హీరో సిద్ధార్థ్ తో గత కొంతకాలంలో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.
ఈ జంట చట్టా పట్టాలు ఏసుకొని వెకేషన్ లు పబ్బులు, పార్టీలు తిరుగుతున్నప్పటికీ వారి మధ్య లవ్ ఉన్నట్టుగా ఇంతవరకు బయటపెట్టలేదు.
అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి, లవ్ విషయంలో అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై స్పందించలేదు ఈ జంట.ఇక గత కొద్దిరోజులుగా 2023లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మొదటి సెలబ్రిటీ జంట వీరే అంటూ బాలీవుడ్ సినీ వర్గాలను వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.కానీ ఆ జంట మాత్రం ఎవరి సినిమాల షూటింగ్స్ లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు.ఇద్దరికీ సమయం దొరికినప్పుడల్లా మీటింగ్లో పార్టీలో వెకేషన్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ వారి మధ్య లవ్ ఉందా అంటే లేదు అని చెప్పుకుంటూ కవర్ చేస్తున్నారు.ఇకపోతే మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలుకానుండడంతో ఈ జంట వికేషన్స్ కి బయలుదేరింది.

అయితే వీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అన్నది తెలియదు కానీ తాజాగా ఈ జంట ముంబై ఎయిర్పోర్టులో ఇద్దరు కలిసి కనిపించారు.న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కారు ఈ జంట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్స్ పెళ్లికి ముందే ఇలాంటివి అవసరమా అంటూ ఆ జంట పై ట్రోలింగ్స్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం సిద్ధార్థ్, రష్మిక మందనతో కలిసి మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు.ఇక ప్రియురాలు కియారా కోసం కొద్ది రోజులపాటు మిషన్ మజ్ను ప్రమోషన్స్ కి బ్రేక్ ఇచ్చి మరి విదేశాలకు పయనమయ్యాడు మన హీరో.







