కోవిడ్ రూల్స్ విషయంలో మోడీ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.జాతీయ రాజకీయాలలో రాహుల్ కీలకంగా రాణిస్తున్నారు.

 Revanth Reddy's Sensational Comments On Modi Government Regarding Covid Rules ,-TeluguStop.com

రాహుల్ పాదయాత్రకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారు.ఇదే సమయంలో ప్రజల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.

సినిమా సెలబ్రిటీలు సైతం రాహుల్ గాంధీతో కలిసి అడుగులు వేస్తున్నారు.దేశ సమైక్యత చాటే రీతిలో రాహుల్ ప్రసంగాలు ఉండటంతో చాలామంది ఆకర్షితులవుతున్నారు.

ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం  కరోనా నిబంధనలు రాహుల్ గాంధీ పాదయాత్రకి విధించటంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ పాదయాత్ర భయంతోనే మోడీ ప్రభుత్వం కరోనా నిబంధనలు తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

బీజేపీ కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు.ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితిలు.ఎదుర్కొంటున్నారని.

రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube