ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు.విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన వద్దన్న ఆయన సైకిల్ పాలన ముద్దని చెప్పారు.
అహంభావంతో నిండిపోయిన వ్యక్తి జగన్ అని, రైతుల మీద వాలంటీర్ల పెత్తనం ఏంటో అర్ధం కాదని చంద్రబాబు విమర్శించారు.
పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు.పంపుసెట్లకు మోటర్లు పెడుతున్నారని మండిపడ్డారు.
జగన్ అన్ని వ్యవస్థలను మారుస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.