ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ యూజర్లు షాక్ ఇచ్చారు.ట్విట్టర్ హెడ్ గా మస్క్ తప్పుకోవాలంటూ యూజర్లు తీర్పునిచ్చారు.
ట్విట్టర్ బాధ్యతల నుంచి తప్పుకోమంటారా అంటా మస్క్ పోల్ నిర్వహించగా .యూజర్లు ఊహించని షాక్ ఇచ్చారు.అయితే పోల్ లో ఎలాంటి ఫలితం వచ్చినా కట్టుబడి ఉంటానని మస్క్ తెలిపిన విషయం తెలిసిందే.కాగా మస్క్ ఒపీనియన్ పోల్ లో దాదాపు కోటి 75 లక్షల మంది యూజర్లు పాల్గొన్నారు.
మస్క్ కు వ్యతిరేకంగా 57 శాతం యూజర్లు ఓటు వేశారు.ట్విట్టర్ హెడ్ గా మస్క్ కొనసాగాలని 43 శాతం యూజర్లు ఓటు వేశారు.ఈ నేపథ్యంలో ఏకపక్షంగా పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారని మస్క్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







