హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఇవాళ నిర్వహించాల్సిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది.కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల వ్యతిరేకత కారణంగా సమావేశం వాయిదా పడింది.
సీఎల్పీ నేత భట్టి నివాసంలో భేటీ అయిన సీనియర్లు పీసీసీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు సీనియర్ నేతలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇస్తుంది.
పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే 90 శాతం పదవులు వచ్చాయని మల్లు రవి చెబుతున్నారు.అయితే టీ- కాంగ్రెస్ లో నెలకొన్న అసమ్మతిపై పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదని సమాచారం.
అదేవిధంగా సాయంత్రం గాంధీభవన్ లో హాత్ సే హాత్ జోడో సన్నాహక సమావేశం జరగనుంది.