ఏపీ పోలీస్ నియామకాల బోర్డు ఛైర్పర్సన్కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.పోలీస్ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయో పరిమితి ఐదేళ్లు సడలించాలని లేఖలో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ చాలా మందికి అందని ద్రాక్షలా మారిందని తెలిపారు.ప్రతి సంవత్సరం పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు.
కానీ మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని వెల్లడించారు.అర్హత కోల్పోయిన వారికి అవకాశం ఇచ్చేందుకు గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లకు పెంచాలని లేఖలో స్పష్టం చేశారు.