గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏడోసారి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ జామ్నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గెలుపొందింది.
బీజేపీ అభ్యర్థిగా నిలబడిన ఆమె 61,065 వేల ఓట్ల మెజారిటీతో విజయ బావుటా ఎగురవేసింది.అయితే భార్య ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రవీంద్ర జడేజా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అతడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి తన భార్య రివాబాకు ఫుల్ సపోర్ట్ అందించాడు.ప్రచారం కూడా చేసి తన సతీమణి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆమె గెలుపొందడంతో ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమెకు ట్విట్టర్ వేదికగా కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు.‘హలో ఎమ్మెల్యే‘ అంటూ తన భార్యకు విషెస్ చెప్పాడు.గుజరాతీ భాషలో ఓ ట్వీట్ చేస్తూ.ఈ పదవి పొందేందుకు తన భార్య నిజంగా అర్హురాలని అతడు పేర్కొన్నాడు.తన భార్య గెలవడంతో ఆ నియోజకవర్గ ప్రజలందరూ గెలిచినట్లు పేర్కొన్నాడు.ఇక తన సతీమణి హయాంలో జామ్ నగర్ నియోజకవర్గంలో పనులన్నీ వేగంగా జరిగిపోతాయని హామీ కూడా ఇచ్చాడు.
అలానే తన సతీమణిని గెలిపించిన జనాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
మరోవైపు తన భార్య విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చాలా బిల్డప్పులు ఇస్తున్నాడు.దాంతో ఫ్యాన్స్ బిల్డప్ బాబాయ్ లా మారావేంటి జడేజా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ క్రికెటర్కి సంబంధించిన ఓ వీడియో మాత్రం చాలామందికి కోపం తెప్పిస్తోంది.
ఎందుకంటే ఈ వీడియోలో జడేజా డప్పులు వాయిస్తున్న వారిపై డబ్బులు విసురుతూ కనిపించాడు.ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు డబ్బులను ఇలా విసిరేయటం ఏం బాగోలేదని, చేతికిస్తే వారిని గౌరవించినట్లు అవుతుందని కానీ ఇలా డబ్బులను కింద పడేసి అందరినీ అవమానించడం తనకి తగినది కాదని కామెంట్లు చేస్తున్నారు.