తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సమావేశాన్ని నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.నూతన భారతాన్నినిర్మిద్దామని అన్నారు.
దేశంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పారు.కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ తెలిపారు.
కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిని చేద్దామని పేర్కొన్నారు.రైతు రాజ్యంలో ప్రతి ఇంటితో పాటు కొండ ప్రాంతాలకు కూడా నల్లా నీళ్లిద్దామన్నారు.
దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు దేశమంతా రైతు బంధు పథకం అమలు కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు.