కర్ణాటక – మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది.బెల్లాంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటిస్తామని మహారాష్ట్ర మంత్రులు తెలిపారు.
ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కర్ణాటక వాసులు నిరసనకు దిగారు.మహారాష్ట్ర వాహనాలపై సరిహద్దుల్లో దాడులకు యత్నించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.