ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

ఇవాళ ఏపీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.రాష్ట్రంలో రెండు రోజులపాటు ఆమె పర్యటన కొనసాగనుంది.

ఇందులో భాగంగా ఉదయం 10 గంటల 15 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుంటారు.రాష్ట్రపతికి సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలకనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పౌర సన్మాన కార్యక్రమానికి ముర్ము హజరుకానున్నారు.రాష్ట్రపతికి గవర్నర్, సీఎం జగన్ పౌర సన్మానం చేయనున్నారు.

అనంతరం రాష్టపతికి గవర్నర్ విందు ఇవ్వనున్నారు.మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి రాష్ట్రపతి ముర్ము బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

విశాఖ తీరంలో జరగనున్న నేవీ డే వేడుకలకు ఆమె హాజరుకానున్నారు.అనంతరం రాత్రి తిరుపతికి వెళ్లనున్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు