ఈనెల 4న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు.ఈ నెల 4, 5 వ తేదీల్లో ఆమె పర్యటన ఉండనుందని సమాచారం.

 President Draupadi Murmu To Ap On 4th Of This Month..!-TeluguStop.com

పర్యటనలో భాగంగా విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించే నేవీ డే వేడుకలతో పాటు పలు కార్యక్రమాలకు ఆమె హాజరుకానున్నారు.నేవీ డే వేడుకలలో భాగంగా భారత నౌకాదళం కార్యాచరణ ప్రదర్శనను వీక్షించనున్నారు.

రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభిస్తారు.

అనంతరం కర్నూలు జిల్లాలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్ డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని ముర్ము ప్రారంభించనున్నారు.

అదేవిధంగా పలు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముర్ము తొలిసారిగా ఏపీకి రానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube