కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.రెండు లారీలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.
ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీ డివైడర్ ను దాటి అవతల ఉన్న మరో లారీని ఢీకొట్టింది.దీంతో క్యాబిన్ నుంచి మంటలు భారీగా చెలరేగడంతో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవ దహనమైయ్యారు.
ఎర్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.







