నందమూరి బాలకృష్ణ బోయపాటి కలయికలో వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించిన విషయం చెప్పాల్సిన పనిలేదు.బోయపాటి – బాలయ్య కలయిక అంటే బ్లాక్ బస్టరే అని మరోసారి రుజువు చేసింది.
ఇక ఇప్పుడు అఖండ 2 సిద్ధం అవుతుంది.ఈ విషయాన్నీ స్వయంగా బాలయ్యనే తెలిపారు.
ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
వీటి తర్వాత అఖండ 2 నే అని బాలయ్య చెప్పుకొచ్చారు.ఈ ఏడాది జరుగుతున్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో అఖండ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డిలతో పాటు బాలయ్య కూడా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు బాలయ్య.
అఖండ సినిమా సబ్జెక్టు ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి పరిమితమైంది కాదు.
అఖండ 2కి సబ్జెక్టు లాక్ చేసి పెట్టాం.మా నిర్మాత, దర్శకుడు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అఖండ సీక్వెల్ చేసేస్తాం.అందుకే సినిమాలో ఓ పాయింట్ ని రివీల్ చేయకుండా ఉంచామని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.అఖండ తో రిలీజ్ అయినా కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో ఎంతగా అలరించిందో.
ఏ మేరకు కలెక్షన్లు రాబట్టిందో తెలియంది కాదు.అందుకే అఖండ 2 ను పాన్ ఇండియా లెవల్లో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.