రఘునాథపురం తక్షణమే నూతన మండలంగా ప్రకటించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోట్టిమర్రి చౌరస్తాలో మండల సాధన కమిటీ అధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష 108వ రోజుకు చేరింది.శుక్రవారం ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నేత సుదగాని హరిశంకర్ గౌడ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

 Raghunathapuram Should Be Declared A New Mandal Immediately-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రఘునాథపురం గ్రామానికి మండలం కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు.పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వెసులుబాటు కోసం ప్రభుత్వం చొరవ తీసుకోని రఘునాథపురం పరిసరాల గ్రామాలన్ని కలుపుకోని కొత్త మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, యoపిటిసి బోడిగె రేణుక పెంటయ్య గౌడ్,పానుగుంటి శ్రీనివాస్ రెడ్డి,బాల్ రెడ్డి,గుంటి మధుసూదన్ రెడ్డి,గుర్రం సిద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube