రఘునాథపురం తక్షణమే నూతన మండలంగా ప్రకటించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోట్టిమర్రి చౌరస్తాలో మండల సాధన కమిటీ అధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష 108వ రోజుకు చేరింది.

శుక్రవారం ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నేత సుదగాని హరిశంకర్ గౌడ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రఘునాథపురం గ్రామానికి మండలం కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు.

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వెసులుబాటు కోసం ప్రభుత్వం చొరవ తీసుకోని రఘునాథపురం పరిసరాల గ్రామాలన్ని కలుపుకోని కొత్త మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, యoపిటిసి బోడిగె రేణుక పెంటయ్య గౌడ్,పానుగుంటి శ్రీనివాస్ రెడ్డి,బాల్ రెడ్డి,గుంటి మధుసూదన్ రెడ్డి,గుర్రం సిద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.

కోట్ల ఆస్తి ఉంది.. విడాకుల తర్వాత ఈమె ఎక్కడ నివసిస్తుందో తెలిస్తే…?