అమరావతిలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు ముదురుతోంది.మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రి జోగి రమేశ్ భేటీ అయ్యారు.ఎమ్మెల్యే ఆరోపణలపై మంత్రి జోగి రమేశ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.
కాగా నిన్న సజ్జలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.