యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో కమర్షియల్ యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆన్ లైన్ లో ఫిష్ అమ్మే యాప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ కమిట్ అయ్యాడు.
అందుకు సంబంధించిన హడావుడి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ చేస్తున్నారు.ఫ్యాన్స్ ఈ సమయంలోనే ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న మొత్తం ఎంత అంటూ చర్చించుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కు చెందిన ఏ ఒక్క హీరో కూడా తీసుకోనంత పారితోషికంను ఎన్టీఆర్ ఈ కమర్షియల్ యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్నాడు అంటున్నారు.ముఖ్యంగా తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ తీసుకుంటున్న పారితోషికం ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మహేష్ బాబు ఒక కమర్షియల్ యాడ్ లో నటించాడు.ఆ యాడ్ కు మహేష్ బాబు తీసుకున్న పారితోషికం తో పోల్చితే తాజాగా ఎన్టీఆర్ ఈ కొత్త యాడ్ కు తీసుకున్న పారితోషికం ఎక్కవు.
లక్ష రెండు లక్షలు మాత్రమే కాదు ఏకంగా కోటిన్నర రూపాయలు ఎక్కువ అంటూ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ఈ స్థాయిలో ఎన్టీఆర్ కు రెమ్యూనరేషన్ దక్కడానికి కారణం ఆయన ఈ మధ్య కాలంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు.ఆ గుర్తింపు కారణంగానే మహేష్ బాబు కంటే కూడా ఎక్కువ పారితోషికంను మొదటి సారి ఎన్టీఆర్ తీసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు తో పాటు ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో మంది కూడా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు.ఆ యాడ్స్ ల్లో ఎన్టీఆర్ యాడ్స్ చాలా విభిన్నంగా ఉంటాయని.
జనాలను మోసం చేసే విధంగా ఉండవు అని.జనాలను చీట్ చేసే సంస్థలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించదు అంటూ దీంతో మరోసారి నిరూపితం అయ్యింది.