అమెరికాలో మంచు కురవడం సహజమైన విషయమే, అమెరికన్స్ మంచు కురిసే సమయంలో చాలా సరదాగా గడుపుతారు, మంచులో ఆడుకుంటారు కూడా, అయితే ప్రస్తుతం అమెరికాను మంచు తుఫాను ముంచేస్తోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మంచు పెరుకుపోతోంది.
గడిచిన రెండు రోజులుగా అమెరికాకు కీలక నగరమైన న్యూయార్క్ పై మంచు ప్రభావం తీవ్రమవుతోంది.న్యూయార్క్ తో పాటు పలు ప్రాంతాలు కూడా మంచు ప్రభావానికి వణికిపోతున్నాయి.
ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ ప్రాంతంలో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని తెలుస్తోంది.రోడ్లపై సుమారు 6 అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది.
దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా న్యూయార్క్ లో ఇద్దరు పౌరులు మృతి చెందినట్టుగా న్యూయార్క్ ప్రభుత్వం వెల్లడించింది.కాగా రానున్న 24 గంటల్లో ఈ మంచు ప్రభావం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఒక వేళ వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి న్యూయార్క్ ప్రజలను అధికారులు హెచ్చరించారు.
అలాగే ప్రధానంగా రద్దీగా ఉండే రోడ్లు అన్నీ మంచుతో నిండిపోయాయి.దాంతో ప్రధాన రహదారులపై ఎలాంటి ప్రయాణాలకు అనుమతులు లేవని ప్రకటించారు.అంతేకాదు విమాన ప్రయాణాలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం.ఇదిలాఉంటే

మంచు ప్రభావంతో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు స్థానిక రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.అంతేకాదు మంచు కారణంగా ఇళ్ళలో చిక్కుకు పోయిన కనీస అవసరాలకు ఇబ్బంది పడుతున్న సుమారు 280 మందికి సహాయాన్ని అందిస్తున్నారు.చాలా ప్రాంతాలలో విద్యుత్ స్తంభించి పోయింది.
నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఎమర్జెన్సీని సైతం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.







