కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కల్లోలం సృష్టిస్తోంది.కాగజ్ నగర్ మండలంలో పులి సంచరిస్తోంది.
విలేజ్ నెంబర్ పదమూడు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలోకి వచ్చింది.దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు.కాగా గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ లో పెద్దపులి ముగ్గురిపై దాడి చేసి చంపేసింది.
తాజాగా ఇంటి ఆవరణలోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.వీలైనంత త్వరగా ఫారెస్ట్ అధికారులు మ్యాన్ ఈటర్ ను పట్టుకోవాలని కోరుతున్నారు.







