గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అపోలో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది.కిడ్నీలో రాళ్లు ఉండటంతో సర్జరీ చేయించుకున్నారు.
ప్రస్తుతం అపోలో హాస్పిటల్ ఐసీయూలో ఉన్న ఆయన రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు.ఆ తర్వాత రెండు వారాలు పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
15 రోజులు విశ్రాంతి తర్వాత లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడానికి కొడాలి నాని రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
రాజకీయ నేతగా కొడాలి నానికి గుడివాడలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.
వైసీపీ పార్టీలో ఉన్న అందరి నాయకులలో కొడాలి నాని.సీఎం జగన్ కి నమ్మినబంటు.
ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చాలా సందర్భాలలో తెలిపారు.ఇక వైసీపీ తరుపున టీడీపీ కీలక నాయకులకు కౌంటర్ లు ఇవ్వడంలో నాని ఎప్పుడూ కూడా ముందుంటారు.
ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ కి తనదైన పంచ్ డైలాగులతో కౌంటర్ లు వేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వార్తలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది.







