“మక్కల్ నీది మయ్యమ్” పార్టీ అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అందరూ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు.
చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ లో జరిగిన పార్టీ సమావేశంలో.జిల్లా నేతలు మరియు రాష్ట్ర నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు.
జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలా లేకపోతే పొత్తులతో ముందుకు వెళ్లాలా అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో పొత్తులకు సంబంధించి.
నేతల వద్ద నుండి సూచనలు తీసుకోవడం జరిగింది.అయితే ఈలోగా బూత్ కమిటీల వారీగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు నాయకులను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు.ఇక గత ఎన్నికలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో డీఎంకే పార్టీతో… కమల్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తమిళ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.







