హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజీమా మోహన్ గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం మనందరికీ తెలిసిందే.గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్ లో అనేక రకాల వార్తల వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే మొదట్లో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు వినిపించినప్పుడు వారి మధ్య ఎటువంటి సంబంధం లేదు అంటూ కొట్టి పడేసిన ఈ జంట ఆ తర్వాత ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా వారిద్దరూ కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా ఈ జంట అభిమానులు ఎప్పుడూ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
నవంబర్ 28న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.వీరి పెళ్లికి గ్రాండ్ గా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
వీరి పెళ్ళికి సన్నిహితులు స్నేహితులతో పాటు సినీ సెలబ్రిటీలను కూడా ఈ పెళ్లికి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఈ జంట విషయానికి వస్తే దేవరట్టం సినిమాలో కలిసి నటించారు గౌతమ్ మంజీమా మోహన్.ఆ సినిమాతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొద్ది రోజులపాటు వీరు డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి.గత నెలలో అక్టోబర్ 31వ తేదీన కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు మంజీమా మోహన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇక ఆ తర్వాత నవంబర్ 5న వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను గౌతమ్ షేర్ చేయడంతో తనకు కూడా ఇష్టం ఉంది అని గౌతమ్ కార్తీక్ చెప్పకనే చెప్పేశాడు.