పోలవరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి అంబటి

ఏలూరు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు.దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు.

 Minister Ambati To Visit The Polavaram Project-TeluguStop.com

అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, పవర్ ప్రాజెక్ట్, స్పిల్ వే పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.అనంతరం ప్రాజెక్ట్ పనుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గడంతో పనులు వేగవంతం అయ్యాయని మంత్రి అంబటి తెలిపారు.లోయర్ కాఫర్ డ్యాం పనులు ప్రారంభం అయ్యాయన్నారు.

డయాఫ్రం వాల్ చుట్టూ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాక పరిస్థితులను బట్టి రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు చేపడతామని వెల్లడించారు.సీడబ్య్లూసీ అనుమతులు ఇస్తే కానీ పనులు ప్రారంభించేందుకు అనుమతి లేదన్న ఆయన అప్పటి వరకు లోయర్ కాఫర్ డ్యాం పనులు చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube