ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.ఇవాళ జరిగిన విచారణలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై వాదనలు జరిగాయి.

 Hearing On Pd Act Petition Of Mla Rajasingh Adjourned Till Tomorrow-TeluguStop.com

ఇందులో భాగంగా ప్రభుత్వ న్యాయవాది జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.అదేవిధంగా రాజాసింగ్ తరపు వాదనలను ఎల్ రవిచందర్ మరోసారి వినిపించనున్నారు.

ఈ క్రమంలో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

రాజాసింగ్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఆయనపై ఉన్న పీడీ యాక్ట్ పిటిషన్ ఎత్తివేస్తేనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి.అయితే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడాన్ని అడ్వైజరీ బోర్డు కూడా సమర్థించింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube