Bhimavaram Students Fight: భీమవరంలో దారుణం..ఇంజనీరింగ్ విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి..!!

భీమవరం పట్టణంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు.

 Atrocious In Bhimavaram Engineering Student Attacked By Fellow Students Details,-TeluguStop.com

ఒక విద్యార్థిని గదిలో నిర్బంధించి అమానుషంగా దాడి చేశారు.ఓ యువతి విషయంలో వివాదం తలెత్తడంతో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న అంకిత అనే విద్యార్థిని గదిలో నిర్బంధించి కర్రలతో… దాడి చేశారు.

అనంతరం ఇస్త్రీ పెట్టితో కాల్చి చిత్రహింసలు పెట్టారు.

ఈ క్రమంలో తనని విడిచి పెట్టాలని బాధిత విద్యార్థి.

బతిమాలిన గాని తోటి విద్యార్థులు కనికరించలేదు.అయితే సదరు విద్యార్థి పై దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది విద్యార్థులు వీడియో తీయడంతో అది నిన్న వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు.

ఈ క్రమంలో దాడికి పాల్పడిన ప్రేమ్, ప్రవీణ్, నీరజ్, స్వరూప్ లపై కేసు నమోదు చేశారు.ఈ విద్యార్థులంతా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారిని పోలీసులు తెలిపారు.

ఇక ఇదే సమయంలో ఘటనపై స్పందించిన కాలేజీ యజమాన్యం బాధిత యువకుడు మరియు యువతి సహా ఆరుగురిని కాలేజీ నుండి సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube