ఏపీలో మరో నూతన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.రాష్ట్రంలో త్వరలో జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమం ప్రారంభంకానుంది.
ఏపీ ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక ఫోన్ లైన్ ద్వారా తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు.దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
కాగా నవంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.ఇందుకు గానూ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించారు.







