ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒక్క సినిమాతో అమాంతం పెరిగి పోయింది.కేవలం సౌత్ మాత్రమే ఇతడిని ఆరాధించే వారు.
కానీ ఇప్పుడు అలా కాదు.మన కంటే బాలీవుడ్ జనాలు ఇతడిని మరింత ఆరాధిస్తున్నారు.
ఈయన పుష్ప 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.మరి ఈయనపై ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటో అందరికి తెలుసు.
అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలో భాగం అయిన వారంతా పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక రీసెంట్ గానే 2021 ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఘనంగా జరుగగా.
దీనిలో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా దాదాపు అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుని తగ్గేదేలే అంటూ నిరూపించుకుంది.అల్లు అర్జున్ ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఈ సినిమాను టాప్ లో నిలబెట్టగలిగాడు.

ఇక తాజాగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా పుష్ప సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కు అవార్డు వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ.లాస్ట్ ఇయర్ కూడా ఈ అవార్డు తాను అందుకున్నానని.ఈ ఏడాది కూడా వచ్చింది.ఇక నెక్స్ట్ ఇయర్ కూడా అందుకుని హ్యాట్రిక్ పూర్తి చేస్తానని తెలిపాడు.ఈయన మాటలను విన్నవారంతా ఇంత కాన్ఫిడెంట్ తప్పకుండ ఉండాలి.
అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నెక్స్ట్ ఇయర్ కూడా నాదే అంటూ చెప్పాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.ఇక త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.







