హైదరాబాద్ బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్ నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.నిందితులను నాంపల్లి కోర్టు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజినిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా డీఏవీ స్కూల్ ఘటనపై మరిన్ని ఆధారాలను పోలీసులు సేకరించనున్నారు.
ఇప్పటికే ఘటనకు కారణమైన స్కూల్ గుర్తింపును తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే.