తమిళం లో సూపర్ హిట్ అయిన పోనియిన్ సెల్వం తెలుగు మరియు ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో వసూళ్ల ను రాబట్ట లేక పోయింది.కలెక్షన్స్ విషయం లో ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించ లేక పోయినా కూడా మణిరత్నం సినిమా అవడం తో మంచి చర్చ అయితే జరిగింది అనడం లో సందేహం లేదు.
తమిళ నాడు లో ఇండస్ట్రీ హిట్ సక్సెస్ దక్కించుకున్న ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే రెండవ పార్ట్ షూటింగ్ పూర్తి అయిందని దర్శకుడు మణిరత్నం గతం లోనే ప్రకటించాడు.
అంతా షూటింగ్ ఒకే సారి జరిగిందని ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి విడుదల చేస్తున్నాం.
ఈ సినిమా విడుదలైన వెంటనే రెండవ పార్ట్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లుగా దర్శకుడు మణిరత్నం ప్రకటించాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా రెండవ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట.మొదట సినిమా రెండు పార్ట్ లను కూడా కేవలం రెండు లేదా మూడు నెలల గ్యాప్ లోనే విడుదల చేయాలని భావించాడు.
కానీ తాజాగా అందిస్తున్న సమాచారం ప్రకారం ఆరు నెలల సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.
రెండవ పార్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో పూర్తయింది.షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.కనుక వెంటనే మొదలు పెడితే ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.
కానీ దర్శకుడు మణిరత్నం మాత్రం గ్యాప్ ఉండాలి అనే ఉద్దేశం తో వచ్చే సంవత్సరం సమ్మర్ వరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.తమిళ మీడియా లో వస్తున్న కథనాల అనుసారం వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా భారీ ఎత్తున మళ్లీ పాన్ ఇండియా స్థాయిలో పొన్నియిన్ సెల్వన్ 2 ను విడుదల చేయబోతున్నారట.